ఎయిర్‌పోర్ట్‌లో క్యూలో నిల్చున్న కేటీఆర్.. నెటిజన్ల ఫిదా

by Disha Web Desk 4 |
ఎయిర్‌పోర్ట్‌లో క్యూలో నిల్చున్న కేటీఆర్.. నెటిజన్ల ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: యూకే పర్యటనలో భాగంగా ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కేటీఆర్ క్యూలో నిల్చున్నారు. తనిఖీలు చేసే సమయంలో సామాన్యుడిలా క్యూలో నిల్చున్నారు. దీంతో ప్రయాణికులు మంత్రితో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. క్యూలో నిల్చున్న కేటీఆర్ ను ప్రయాణికులు ఆసక్తిగా విక్షీంచారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక ద్వారం గుండా మంత్రికి ఎయిర్ పోర్ట్ లోకి ఎంట్రీ ఉంటుంది. అయినా కేటీఆర్ సాధారణ ప్రయాణికుడిలా క్యూలో నిల్చుని లోపలికి వెళ్లడంతో కేటీఆర్, బీఆర్ఎస్ ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

Also Read:

UKలో స్మగ్లింగ్ కేసులో 12 మంది భారత సంతతి వ్యక్తులు అరెస్ట్

Next Story